- దేవాలయ భూములనూ కాపాడే యత్నం
- కఠిన చర్యలకు వెనకాడేది లేదని స్పష్టం
- ఉన్నతస్థాయి సక్షలో మంత్రి కెటిఆర్
ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రభుత్వ,దేవాదాయ భూముల ఆక్రమణలపై దృష్టి సారించింది. ఎక్కడెక్కడ ఇక ఆక్రమణలు ఉన్నాయో వాటిని తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నది. కఠిన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రెవెన్యూ, దేవాదాయ భూములపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలకు జియో ఫెన్సింగ్, జీఐఎస్ మ్యాపింగ్ చేయాలన్నారు. హైదరాబాద్లో ప్రభుత్వ భూముల రక్షణ చర్యలపై మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం సక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, సుధీర్రెడ్డి, కేపీ వివేకానంద, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ… వివాదాల్లోని ప్రభుత్వ భూముల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అర్హులైన పేదలకు భూములు క్రమబద్దీకరించి హక్కులు కల్పించినట్లు చెప్పారు. మరోసారి పేదలకు భూహక్కుల కల్పనపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. దశాబ్దాల క్రితం నాటి లీజ్లను సక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. లీజ్ నిబంధనలు మార్చి ఆయా శాఖలకు మరింత ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ కలిసి పనిచేయాలన్నారు. ప్రభుత్వ స్థలాలను ప్రజాప్రయోజనాలకు వినియోగించడంపైనా పరిశీలన చేయాలని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్రభుత్వ భూములను కాపాడేందుకు రెవెన్యూ తో జిహెచ్ఎంసి అధికారులు
సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాలకు జియో పెన్సింగ్, జిఐఎస్ మ్యాపింగ్ చేయాలన్నారు. ప్రభుత్వ భూములపైన ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను ప్రజాప్రయోజనాలకు ఉపయోగించు కునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. దశాబ్దాల కింద తీసుకున్న లీజ్ లను సక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లీజ్ నియమ నిబంధనలు మార్చి ఆయా శాఖలకు మరింత ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. మరోసారి ఇలాంటి అవకాశాన్ని కల్పించే అంశంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.