హైదరాబాద్ ,సెప్టెంబర్ 6: రాష్ట్రంలోని ఉపాధ్యాయ,విద్యారంగ సమస్యలు ఏడేళ్లుగా పరిష్కారానికి నోచుకోనందున తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మూడు దశల ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించ నున్నదనీ .. మొదటి దశ ఆగస్ట్ నెల 18న న అన్ని మండల కేంద్రాల లోని తహసిల్దార్ కార్యాలయం ముందు ,రెండవ దశ .
28 న అన్ని జిల్లా కేంద్రాలలోని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించి 28 డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాలను అందించనైనదనీ కానీ ప్రభుత్వం నుండి ఆశించిన స్పందన లేనందున మూడవ దశ ఈ నెల 9 న హైదరాబాదులోని పాఠశాల విద్యా సంచాలకులు (డీఎస్సి ) కార్యాలయాన్ని తమ సమస్యల సాధనకై ముట్టడించడం జరుగుతుందని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు ,సీపీఎస్ రద్దు మొదలగు తమ డిమాండ్ల పై తక్షణమే స్పందించాలని టీపీటీఎఫ్ అధ్యక్షులు కె.రమణ ,ప్రధాన కార్యదర్శి మైసా శ్రీనివాసులు పిలుపునిచ్చారు.