రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. 24 గంటల్లో కొత్తగా 784 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్ నుంచి 1028 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా 5 గురు మృతి చెందారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 89 కేసులు నమోదవగా, నల్లగొండ జిల్లాలో 71 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 52 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,28,282 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,703కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,13,124 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 11,455గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.