త్వరలో తెలంగాణలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. గురువారం తెలంగాణ శాసనసభ పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఉద్యోగ విరమణ వయోపరిమితి 61 ఏళ్లకు పెంపు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛను పెంపు బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది.
ఉద్యోగ విరమణ వయో పరిమితి 61 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కనీస పింఛను రూ.50వేలు, గరిష్ఠ పింఛను రూ.70వేలకు పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.10లక్షలకు పెంచుతూ ప్రవేశ పెట్టిన బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది.