*ఆందోళనలో సిబ్బంది
కొరోనా పోరాటంలో ముందు వరుసలో ఉండే పోలీసు, వైద్య సిబ్బందిలో వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. సోమవారం జరిపిన పరీక్షల్లో పేట్ల బురుజు మెటర్నటీ హాస్పిటల్లో 32 మంది వైద్య సిబ్బందికి వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయినట్టు తెలిసింది. వారిలో 18 మంది వైద్యులు, 14
మంది సిబ్బంది ఉన్నారు. కాగా, పూర్తిస్థాయి జాగ్రత్తలు, పీపీఈ కిట్లు ధరించినప్పటికీ వైద్య సిబ్బందికి కొరోనా సోకవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఉస్మానియా వైద్య కళాశాల అనుబంధ హాస్పిటల్స్ తో పాటు, నిమ్స్, కింగ్ కోఠి, గాంధీ ప్రభుత్వ దవాఖానాల్లో పదుల సంఖ్యలో వైద్య సిబ్బంది వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే.