జి.వో.నం. 3 పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభు త్వం పార్లమెంటులో చర్చించి రివ్యూ పిటీషన్ వేయాలని , జి.వో. నెం.3 కు చట్ట బద్ధత కల్పించి 9 వ షెడ్యూల్ లో చేర్చాలని ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక (జేఏసి) డిమాండ్ చేసింది. పార్లమెంటు , శాసనసభలు చేసిన చట్టాలను సవరించడంగాని , నిలిపివేయడం గానీ , లేదా పూర్తిగా కొత్త చట్టాలు గానీ చేసే లెజిస్లేటివ్ అధికారం 5 వ షెడ్యూల్ గవర్న రుకు ఇచ్చిం• •న్నారు. దీనిలో భాగం గానే గిరిజ నులనుల్లోని వెనుకబాటు ను పా• •ద్రోలడం కోసం ఈ జీవో వచ్చిందని అన్నారు. కానీ నేడు మైదాన ప్రాం తాల సామాజిక అంశాలను ఏజెన్సీ ప్రాంతాల్లోని చట్టాలతో పోటీ పెట్టి జి.వో 3 ను రద్దు చేయడం అన్యాయమని అ న్నారు.
ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని సవరించాలని , పోడుసాగుదా రులను భూముల నుండి వెళ్ళగొ ట్టాలని , రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని ఆదివాసీలకి వ్యతిరే కంగా తీర్పులు వచ్చేలా ప్రభు•్వ లు న్యాయస్థానాల మీద ఒత్తిడి చేస్తున్నాయని అన్నారు. ఇప్పటికే అక్రమ వలసల వల్ల 54శాతం భూములు అన్యాక్రాం తమయ్యాయని అన్నారు. ఇప్పటికీ గిరిజన భూముల అన్యాక్రాంత కేసులు ఐటిడిఎల వద్ద నడుస్తు న్నాయని అన్నారు. దీన్ని ఆపాల్సిం దిపోయి పెత్తందారులు , భూస్వా ములకు ప్రభుత్వాలు వంతపాడుతు న్నాయని అన్నారు. ఆదివాసీల విష యంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తూ సెప్టెంబర్,29 న ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల మన్యం బంద్ కి ఆదివాసీ సంఘాల ఐఖ్య వేదిక(జేఏసి) పిలుపునిచ్చింది. ఈ బంద్ కి ఆదివాసీ యువత ఉద్యోగులు ,మేధావులు పెద్దఎత్తున కదిలి జి.వో . నెం.3 పునరుద్ధరణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరారు.