Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో కొత్తగా 1088 మందికి పాజిటివ్‌..9 ‌మంది మృతి

రాష్ట్రంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1088 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 1511 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా 9 మంది మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 137 కేసులు నమోదవగా, ఖమ్మం జిల్లాలో 86 కేసులు, నల్లగొండ జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,17,776 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,607కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 5,98,139 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 16,030గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply