సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్31:రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లోని మంత్రి హరీశ్ రావు నివాసంలో ఘనంగా జరిగిన వేడుకలు.. రాఖీ కట్టి మంత్రి హరీష్ రావు కి శుభాకాంక్షలు తెలిపిన సిద్దిపేట మహిళ నాయకులు .. ఈ సందర్భంగా అక్కచెల్లెళ్ళకు పండుగ శుభాకాంక్షలు తెలిపి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ మహిళలకు తోడుగా ఉంటుందని వారి భద్రత, రక్షణ, సంక్షేమం బీఆర్ఎస్ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని తెలిపారు.


