నాగర్కర్నూల్ , సెప్టెంబర్ 10, ప్రజాతంత్ర విలేకరి: సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనదదినంగా అధికారికంగా ప్రకటించాలని అందుకోసం ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని జిల్లా కలెక్టర్ కు బిజేపి పార్టీ అధ్వర్యంలో గురువారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బిజేపి జిల్లా అద్యక్షులు ఎల్లేని సుధాకకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ విమోచన సంఘటనను మరియు తెలంగాణ అమరవీరుల స్థూపాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యమసమయంలో తెలంగాణ వచ్చిన తరువాత సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటిస్తాంఅని అన్నారు. కాని వచ్చిన తరువాత మాట తప్పారు. ఈ సారైనా కేసిఆర్ మాట నిలబెట్టుకోవాలని కోరారు. వినతి పత్రం అందచేసిన వారిలో బిజేపి పార్టీ జిల్లా మాజిఅధ్యక్షులు బుసిరెడ్డి సుబ్బారెడ్డి, నాయకులు ఎదిరెపల్లి శ్రీనివాసులు, చందు, బొఒట్టుశ్రీను తదితరులు పాల్గొన్నారు.