పదుల సంఖ్యలో మృత్యువాత పడడం పై ఆందోళన
కారుణ్య నియామకాలతో ఆదుకోవాలంటున్న టీచర్లుు
చిత్తూరు: ఎక్కువమంది ఉపాధ్యాయులు కొవిడ్ బారిన పడి మృతి చెందడానికి కారణం ఎన్నికల విధులేనని ఎస్టీయూ నేతలు వ్యాఖ్యానించారు. ఇటీవలి పంచాయతీ, మండల పరిషత్, పురపాలక, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలకు వరుసగా విధులు కేటాయించడం వలన ఉపాధ్యాయులు, ఉద్యోగులు కొవిడ్ బారిన పడ్డారని అన్నారు. కొవిడ్తో మృతి చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వడంతో పాటు పరిహారం చెల్లించాలన్నారు. కొవిడ్ విధుల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలన్నారు.
ఉపాధ్యాయులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించాలని, కొవిడ్తో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలకు రూ.50లక్షల వంతున పరి హారం అందజేయాలన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని, మెడికల్ రీయింబర్స్ మెంటు నిబంధనలు సడలించి… కొవిడ్ ఆస్పత్రుల్లో వైద్యానికి అయిన మొత్తం ఖర్చు చెల్లించాలన్నారు. అత్యవసరం అయితే తప్ప ఉపాధ్యాయులకు ఈ పరిస్థితుల్లో ఏ విధులూ అప్పగించకూడదని కోరారు. కరోనా సోకిన టీచర్లలో జిల్లాలో ఇప్పటి దాకా పదుల సంఖ్యలో మరణించారు. సగటున రోజూ ఒక్క టీచరైనా కరోనాతో చనిపోతున్నారు.
ఈ తీవ్రత పెరుగుతూనే ఉంది. ఉపాధ్యాయ వర్గాలను ఈ పరిణా మాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వారి కుటుంబాలు భయాందోళనల్లో కూరుకుపోయాయి. ఆస్పత్రుల్లో పడకలు దొరక్కపోవడం, ఆక్సిజన్ కొరత, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవలు సక్రమంగా అందకపోవడం వంటివి కుంగ దీస్తున్నాయి. హైకోర్టు జోక్యం చేసుకోబట్టి సరిపోయిందికానీ, లేకపోతే బడులు, కాలే జీలు బలవంతంగా నడిపి పుండే వారని, అదే జరిగిఉంటే పరిస్థితి మరింత భయా నకంగా మారిఉండేదని అంటున్నారు.