ఇప్పటి నుంచి నిల్వలు సిద్దం చేసుకోవాలి
అధికారలుతో సక్షలో సిఎం జగన్ సూచన
అమరావతి,జూన్ 23 : వర్షాకాలంలో పనుల కోసం ఇసుక కొరత రాకుండా నిల్వ చేయాలని సిఎం వైఎఎస్జగన్ అధికారులను ఆదేశించారు. నిర్దేశించుకున్న 70 లక్షల టన్నుల ఇసుకను వర్షాకాలంలో పనుల కోసం నిల్వచేయాలని సీఎం సూచించారు. వచ్చే రెండు వారాల్లో మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత వర్షాలు కురుస్తాయి. రీచ్లు మునిగే అవకాశాలు ఉంటాయి. కావాల్సిన ఇసుకను ఇప్పటికే నిల్వచేసుకోవాలి. శ్రీకాకుళం 20 వేలు, తూర్పుగోదావరి 60 వేలు, పశ్చిమగోదావరి 35 వేల టన్నులు, కృష్ణా 50 వేల టన్నులు, గుంటూరు 40 వేల టన్నులు ప్రతి రోజూ ఇసుకను ఉత్పత్తి చేయాలని సీఎం పేర్కొన్నారు. అధికారులతో క్యాంపు కార్యాలయంలో జరిగిన సక్షలో ఇసుక నిల్వలపై సక్షించారు. ఇప్పటికే 46.30 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వచేశామని అధికారులు సీఎం వైఎస్ జగన్కు వివరించారు. రోజువారీ అవసరాలను తీరుస్తూనే.. వర్షాకాలంలో అవసరాల కోసం ఈ ఇసుకను నిల్వ చేశామని తెలిపారు. ఏ చేయకపోయినా.. ఏదోరకంగా వేలెత్తి చూపిస్తారని సిఎం అన్నారు. వర్షాలు కురిసేలోగా ఇసుకను నిల్వచేయాలని, ఈ ఇసుకే వచ్చే కాలంలో వినియోగపడుతుందన్నారు. థర్డ్ ఆర్డర్ నదుల నుంచి, వాగులనుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లడానికి సీఎం అనుమతించారని పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేదీ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన తెలిపారు. ఉపాధిహా కింద భారీగా పనులు కల్పించాలని కలెక్టర్లు దీనిపై దృష్టిపెట్టాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, అంగన్ వాడీ కేంద్రాల ద పూర్తిగా ధ్యాస పెట్టాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. వీటి నిర్మాణాల కోసం స్థలాలను గుర్తించి, వాటిని సంబంధిత శాఖకు అప్పగించంచాలని, వెంటనే పనులు మొదలు పెడతారన్నారు.
నిర్మాణాల విషయంలో ఆలస్యం చేయకూడదని.. ఇవన్నీ కూడా వచ్చే ఏడాది మార్చి 31లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 55వేల అంగన్వాడీలను నాడు- నేడు కింద అభివృద్ధి చేస్తున్నాం. భవనాలు ఉన్నచోట మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేస్తాం.సొంతంగా భవనాలు లేనిచోట కొత్తగా నిర్మాణాలు చేస్తాం. వీటికోసం స్థలాల సేకరించి.. వాటిని పంచాయతీరాజ్కు బదిలీచేయాలని సీఎం ఆదేశించారు. పచ్చదనం పెంపునకు ’జగనన్న పచ్చతోరణం’ కింద 6 కోట్ల మొక్కల నాటాలని లక్ష్యమని సీఎం తెలిపారు. నాడు నేడు కింద, ఖాళీ స్థలాల్లో, ఇంటర్నల్ రోడ్లు, అప్రోచ్ రోడ్లు తదితర ప్రాంతాల్లో మొక్కల నాటే కార్యక్రమం, అలాగే ఇళ్లపట్టాలు ఇవ్వనున్న లే అవుట్స్లో కూడా బాగా మొక్కలు నాటాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఇళ్లపట్టా లబ్దిదారునికీ నాలుగు మొక్కులు ఇవ్వాలని సీఎం సూచించారు. పట్టణ ప్రాంతాల్లో వార్డు క్లినిక్స్, వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ పేరిట నిర్మాణం చేపట్టాలన్నారు. 2 కి. పరిధిలో, కనీసం 15 నిమిషాల వ్యవధిలో నడుచుకుంటూ వెళ్లేదూరంలో వార్డు క్లినిక్స్ నిర్మాణం చేయాలని దీనికోసం స్థలాలను గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇంకా ఎక్కడైనా స్కూళ్లలో పనులు మొదలుపెట్టకపోతే.. దాన్ని తీవ్రంగా చూడాల్సి ఉంది. ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం అవుతున్నందున వెంటనే ఈపనులు పూర్తి చేయాలన్నారు. ఫర్నిచర్, ఫ్యాన్లు అన్నీ కూడా స్కూళ్లకు వస్తున్నాయి. పనులు పూర్తికాకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. స్కూళ్లు తెరిచేలోగా నాడు ? నేడు కింద పనులు పూర్తి కావాలి. కచ్చితంగా కలెక్టర్లు దీనిపై దృష్టిపెట్టాలి. అర్బన్ ప్రాంతాల్లో కాంపౌండ్ వాల్ లాంటి పనుల విషయంలో అక్కడక్కడా వెనకబాటు కనిపిస్తోంది. నాడు ? నేడుకు నిధుల కొరతలేదు. వెంటనే మున్సిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకుని ఈ స్కూళ్లలో పనులు పూర్తయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. సక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేశ్, సిఎస్ నీలం సాహ్ని, డిజిపి గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.