తాజాగా 160 మందికి పాజిటివ్..ఇద్దరు మృతి
రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 160 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్ నుంచి 193 మంది కోలుకున్నారు. కాగా వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 59 కేసులు నమోదవగా, కరీంనగర్ జిల్లాలో 13 కేసులు, ఖమ్మం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలలో 11 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,71,623 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,958కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,63,691 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,974గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.