Take a fresh look at your lifestyle.

రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి

యువత రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే భానోత్‌ ‌శంకర్‌ ‌నాయక్‌ ‌యువతకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే శంకర్‌ ‌నాయక్‌ ‌పుట్టినరోజు సందర్భంగా లోకహిత అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్‌ ‌కళాశాలలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరం ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే ఆపద సమయంలో రక్తదానం చేసి పునర్జన్మ ఇస్తున్న వారే నిజమైన మానవతా మూర్తులని కొనియాడారు కార్యక్రమంలో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్‌ ‌రావు, జెడ్‌ ‌పి టి సి మేక పోతుల శ్రీనివాస్‌ ‌రెడ్డి, స్థానిక సర్పంచ్‌ ‌బీరవెల్లి యాదగిరి రెడ్డి ఎంపీటీసీ వెన్న కుల వాణి శ్రీనివాస్‌, ‌సర్పంచుల, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బానోత్‌ ‌భీముడు, బత్తిని అనిల్‌ ‌గౌడ్‌, ‌వైస్‌ ఎం‌పీపీజే ల్ల వెంకటేష్‌ ,‌రైతుబంధు కమిటీ అధ్యక్షులు కాసం వెంకటేశ్వర్‌ ‌రెడ్డి, మండల అధ్యక్ష కార్యదర్శులు పరి పాటి వెంకట్‌ ‌రెడ్డి, రమేష్‌, ‌లోకహిత అధ్యక్ష, కార్యదర్శులు గంధం వెంకటేష్‌,‌కొరు కొప్పుల మహేష్‌ ‌గౌడ్‌, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Leave a Reply