Take a fresh look at your lifestyle.

మాయమాటలు…అంకెలగారడితో ప్రజలను మోసం

  • డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు, ఇండ్ల స్థలాలు, రుణమాఫీ ఎక్కడ
  • కృష్ణా జలాలకు సంబంధించి ప్రాజెక్టుల మాటే లేదు
  • బడ్జెట్‌పై సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తి
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అం‌కెల గారడి, మాయమాటలు తప్ప ఏమీ లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శ్రీధర్‌ ‌బాబు, జగ్గారెడ్డి, జీవన్‌ ‌రెడ్డిలతో కలసి ఆయన అసెంబ్లీ వి•డియా పాయింట్‌ ‌వద్ద మాట్లాడుతూ… ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని భట్టి ఆరోపించారు. ఎన్నికల సమయం వొచ్చేసరికి..హావి•లతోనే కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌లో బలహీన వర్గాలకు ఒరిగిందేవి• లేదన్న భట్టి.. 8 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు, ఇండ్ల స్థలాలు, రుణమాఫీ ఎక్కడ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సందర్భం వొచ్చిన ప్రతిసారి అధికార పార్టీ నేతలు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని చెబుతున్నారని, కానీ, 5 గంటలు కూడా కరెంట్‌ ‌రావడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో లిక్కర్‌ ఆదాయం ఒక్కటే భారీగా కనిపిస్తుందని.. నిరుద్యోగ భృతి, గిరిజన బంధు ఏమైనాయని భట్టి నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ అని ప్రశ్నించారు. కృష్ణా జలాలకు సంబంధించి ప్రాజెక్టుల మాటే లేదని..ఎవరో అధికారులు రాసిస్తే దాన్ని హరీష్‌ ‌రావు చదివారని భట్టి ధ్వజమెత్తారు. విద్యార్థులను గాలికి వదిలేశారన్నారు. ఇక రుణమాఫీ నిధులు ఏమయ్యాయని ప్రభుత్వంపై భట్టి ప్రశ్నల వర్షం కురిపించారు.

Leave a Reply