అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష
గ్రామీణ ఉపాధి, రైతులకు అదనపు ఆదాయమే లక్ష్యంగా ఆహార శుద్ధి విభాగం పని చేయాలని మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఆహార శుద్ధి విభాగం పని తీరును మంత్రి అధికారులతో కలిసి సమీక్షించారు.
టొబాకోకు వ్యతిరేకంగా ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల్ని రైతులకు సూచించాలని మంత్రి కన్నబాబు పొగాకు బోర్డుకు సూచించారు. టొబాకో బోర్డు చైర్మన్ రఘునాథబాబు, అధికారులు మంత్రిని కలిశారు. పొగాకు కొనుగోళ్లు, ఎగుమతులు, రాయితీల అంశాలపై చర్చ జరిగింది.